
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాజీ విగ్రహ ఏర్పాటు సందర్భంగా జరిగిన అల్లర్ల వెనుక టీఆర్ఎస్ నేత ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అల్లర్లకు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి భర్త, 35వ వార్డు కౌన్సిలర్ శరత్రెడ్డి కారణమని గుర్తించారు. శరత్రెడ్డి మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. విగ్రహన్ని కొనుగోలు చేసింది శరత్రెడ్డేనని, దాన్ని శివసేన జిల్లా ప్రెసిడెంట్ గోపీకి ఇచ్చాడని అంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో తయారు చేయించి 15 రోజుల కిందట్నే బోధన్కు తీసుకొచ్చి.. శరత్రెడ్డి రైస్మిల్లులో దాచారని సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా అంబేద్కర్ సెంటర్లో విగ్రహాన్ని పెట్టేందుకు శరత్రెడ్డి, గోపీ ప్లాన్ చేశారని.. రాత్రిపూట విగ్రహాన్ని చౌరస్తాకు తీసుకొచ్చారని చెప్తున్నారు.