- రూ.10 వేలకు బర్త్, మ్యారేజీ సర్టిఫికెట్లు, టీసీ, బోనాఫైడ్
- వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా మీ సేవ సెంటర్లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఓనర్, ఆపరేటర్ పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సీపీ సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. రాకాసీపేటలోని సహారా మీ సేవ సెంటర్ ఆపరేటర్ షేక్ వసీం ఈజీ మనీ కోసం నకిలీ సర్టిఫికెట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు.
ఈ విషయాన్ని ఓనర్ మహ్మద్ ముక్రంకు చెప్పి పార్ట్నర్షిప్లో దందా చేద్దామని ఒప్పించాడు. తరువాత ఇద్దరు కలిసి ఏజెంట్లను నియమించుకొని గవర్నమెంట్ నుంచి చేయూత పెన్షన్లు పొందేందుకు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి స్కీమ్ లబ్ధి పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్లు, జాబ్స్ కోసం నకిలీ టీసీ, బోనాఫైడ్స్ తయారు చేసేవారు.
ప్రతి సర్టిఫికెట్కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు తీసుకునేవారు. ఇలా రెండేండ్ల నుంచి నకిలీ సర్టిఫికెట్ల బిజినెస్ చేశారు. పక్కా సమాచారంలో నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి ఐదు నకిలీ మీసేవ సర్టిఫికెట్లు, 22 నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జిరాక్స్లు, 13 నకిలీ టీసీ, బోనాఫైడ్స్, షాదీముబారక్ స్కీమ్ కోసం సిద్ధం చేసిన జిరాక్స్లు, రబ్బర్ స్టాంప్, ల్యాప్టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నకిలీ పత్రాలు పొందిన వ్యక్తులు వాటిని ఎక్కడ ఉపయోగించారో? ఆరా తీస్తున్నామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు కావాలని అడగడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐ వెంకటనారాయణ ఉన్నారు.
