బోధన్​లో మున్సిపల్ అధికారుల ర్యాలీ

బోధన్​లో మున్సిపల్ అధికారుల ర్యాలీ

బోధన్​వెలుగు: బోధన్ పట్టణంలోని మున్సిపల్ అధికారులు 100 రోజుల కార్యచరణ ప్రణాళికపై ర్యాలీ నిర్వహించారు.  మున్సిపల్​ ఆఫీస్​ నుంచి అంబేద్కర్​ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగగా,  100రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్​ కమిషనర్ వెంకట నారాయణ, మోప్మా, డ్వాక్ర సంఘాల మహిళలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.