నిధుల దుర్వినియోగం.. మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ బై కాట్

నిధుల దుర్వినియోగం.. మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ బై కాట్

మేడ్చల్ జిల్లా: బోడుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ ను సొంత పార్టీ కార్పొరేటర్లు బాయ్ కట్ చేశారు. మేయర్, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కోట్ల 30 లక్షలు ఖర్చు చేసిన కొనుగోలు చేసిన ఆటోలు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. ఇప్పుడు మరో 60 లక్షలతో ట్రాక్టర్ల కొనుగోలు చేస్తామనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకోసమే కౌన్సిల్ మీటింగ్ బై కాట్ చేశామని  తెలిపారు.