బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు‌ కరోనా

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు‌ కరోనా

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ కరోనా బారినపడ్డారు. ఆయనకు కోవిడ్ -19 వైరస్ సోకినట్లుగా ధృవీకరిస్తూ ఆయన తల్లి నీతూ కపూర్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘రణ‌బీర్ ప్రస్తుతం మెడిసిన్ తీసుకుంటున్నాడు. బాగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాడు. రణ‌బీర్ ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు’ అని నీతు కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నీతూ కపూర్ కూడా గత డిసెంబర్‌లో వైరస్ బారిన పడి కోలుకున్నారు. 

రణబీర్ ప్రస్తుతం శంషేరా చిత్రంలో నటిస్తున్నారు. వాణీ కపూర్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 25, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మస్త’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌనీ రాయ్ నటిస్తున్నారు.