నువ్వు ఎదురుచూస్తున్నా అంటే నాకు భయమేస్తోంది.. కంగనా షాకింగ్ కామెంట్స్

నువ్వు ఎదురుచూస్తున్నా అంటే నాకు భయమేస్తోంది.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఎమర్జెన్సీ(Emergency). భారతదేశానికి ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 నుండి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ ని విధించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కంగనా. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే తాజాగా ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్(karan johar) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు తాను ఎగ్జైటెడ్ గా ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. కరణ్ చేసిన ఈ కామెంట్స్ పై వెటకారంగా స్పందించారు నటి కంగనా. 

ఇందులో భాగంగా కంగనా.. నేను హీరోయిన్ గా చేసిన మణికర్ణికా సినిమా రిలీజ్ సమయంలో కూడా అతను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక అతనే నాపై లేనిపోని అబాండాలు వేశాడు. దాంతో నాతోపాటు ఆ సినిమాలో పనిచేసిన వారు కూడా నాన్ను విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎమర్జెన్సీ విషయంలో మరోసారి ఎగ్జైటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పడు ఏమవుతుందో అని భయంగా ఉంది అంటూ కామెంట్స్ చేసింది కంగనా. ప్రస్తుతం కంగనా, కరణ్ పై చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.