పౌరసత్వ చట్టం: ట్యాక్స్ కట్టే వాళ్లపై ఆధారపడుతూ వెహికిల్స్ ను కాలపెడుతరా?

పౌరసత్వ చట్టం: ట్యాక్స్ కట్టే వాళ్లపై ఆధారపడుతూ వెహికిల్స్ ను కాలపెడుతరా?

సిటిజన్ షిప్ యాక్ట్ కు వ్యతిరేకంగా జరిపిన నిరసనలో జరిగిన హింస గురించి మాట్లాడారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. నిరసనలో భాగంగా వాహనాలను కాలబెట్టిన వారి గురించి కంగన మాట్లాడుతూ… మీరు ఏదైనా నిరసన చేస్తున్నారంటే మొదట గుర్తుపెట్టుకునేది.. శాంతియుతంగా నిరసనను తెలియజేస్తున్నామా లేదా అని అన్నారు. మన దేశ జనాభాలో 4 శాతం మంది మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై మిగితా వారు ఆదారపడి జీవిస్తున్నారని చెప్పారు. అలాంటి కొందరు నిరసన పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ద్వంసం చేయడం మంచిదికాదని చెప్పారు.