ట్విట్టర్‌కు కరణ్ జోహర్ గుడ్ బై

ట్విట్టర్‌కు కరణ్ జోహర్ గుడ్ బై

బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్ జోహర్ ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పాడు.  'జీవితంలో పాజిటివ్‌ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్తున్నా' అంటూ కరణ్  ట్వీట్‌ చేశాడు. అ తరువాత తన ట్విట్టర్‌ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.  

బాలీవుడ్‌ లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన  కరణ్ జోహార్.. ఆ తరువాత ‘కుచ్ కుచ్ హోతా హై’ మూవీతో డైరెక్టర్ గా మారాడు. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఈ మధ్య కాలంలో మాత్రం పూర్తిగా నిర్మాణ రంగం మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కరణ్ నిర్మించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ  మంచి కలెక్షన్స్ రాబట్టగా, ‘లైగర్‌’  సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.