
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ ట్విట్టర్కు గుడ్ బై చెప్పాడు. 'జీవితంలో పాజిటివ్ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్తున్నా' అంటూ కరణ్ ట్వీట్ చేశాడు. అ తరువాత తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. ఈ ట్వీట్పై పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
బాలీవుడ్ లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కరణ్ జోహార్.. ఆ తరువాత ‘కుచ్ కుచ్ హోతా హై’ మూవీతో డైరెక్టర్ గా మారాడు. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో మాత్రం పూర్తిగా నిర్మాణ రంగం మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కరణ్ నిర్మించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టగా, ‘లైగర్’ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.