
HYDERABAD BONALU 2025: తెలంగాణలో బోనాల పండుగను ఎంతో భక్తితో చేసుకుంటారు. ఆషాడ మాసంలో బోనాల శోభతో రాష్ట్రమంతట కూడా అమ్మవారి ఆలయాల్లో ఆదివారం, గురువారం బోనాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా బోనాల పండుగ జులై 26న ప్రారంభం కాగా.. మొదటి ఆదివారం జులై 29 వచ్చింది. . బోనాల ఉత్సవాల్లో ఏమేం చేస్తారు..ఎన్ని ఘట్టాలున్నాయి.. బోనం సమర్పించడం మొదలు..రంగం నిమజ్జనం వరకు ఏ ఘట్టంలో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. . .
ఆషాఢమాసంలో పల్లె నుంచి పట్నం వరకు బోనాల శోభ సంతరించుకుంటుంది. కుల దేవతలతో పాటు.. గ్రామ దేవతలను పూజిస్తారు. పల్లెల్లో సామూహికంగా అమ్మవారిని కొలుస్తారు. ఇక ఆషాఢం వచ్చిదంటే జంట నగరాల కళేవేరు. హైదరాబాద్.. సికింద్రాబాద్తో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో బోనాల వేడుకలు ఘనంగా జరుపుకుంటారు హిందువులు. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢం జాతర అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్, పాతబస్తీ ఆలయాల్లో వరుసగా జరుగుతుంది. ఈఉత్సవాల్లో ముఖ్యంగా ఎనిమిది ఘట్టాలున్నాయి. ఘటోత్సవం, బోనాలు సమర్పించడం మొదలు.. రంగం, నిమజ్జనం వరకు ఉంటాయి.
ఘటోత్సవం: బోనాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి 14 రోజుల వరకు అమ్మవారికి రోజు రెండుపూటలా ఘటోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే జూన్ 26 ను ఘటోత్సవం కార్యక్రమం మొదలైంది. అమ్మవారిని కలశం రూపంలో ఆవాహన చేసి ఊరేగింపుగా తీసుకెళతారు .కలశం దగ్గర అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుతారు. కలశానికి షోడశోపచచార పూజలను ప్రత్యేకంగా చేస్తారు. కలశ రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని తల్లి ఆశీస్సులు ... అనుగ్రహం పొందుతారు. ఆలయ పూజారి ఒళ్లంతా పసుపు పూసుకుని ఘటాన్ని ఊరేగిస్తారు..
బోనాలు : బోనం అంటే బోజనం.. అమ్మవారికి భక్తులు బోనం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతిక్షణం అమ్మవారు తమను కాపాడినందుకు భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపు అన్నం ఇలా వివిధ రకాల ఆహారాన్ని సమర్పిస్తారు. ఇల్లు వాకిలి శుభ్రంచేసి , తలకు స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి ..నైవేద్యం తయారు చేస్తారు. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన పాత్రలో అన్నాన్ని ఉంచి దానిపై మూతపెట్టి దీపం వెలిగించి..గుంపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.
వేపాకు సమర్పించడం: వీటిలో సైద్దాంతికంగా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పసుపు నీటిలో వేపాకు ముంచి బోనంతో సమర్పిస్తారు. ఆషాఢమాసంలో వర్షాలు కురవడం మొదలవుతాయి. వర్షాలకు వ్యాపించే క్రిమికీటకాలను తరిమికొట్టేందుకు క్రిమినాశినిగా వేపాకు ఉపయోగపడుతుంది... పైగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం కూడా ఇదే.
ఫలహారం బండి: బోనాలు జరుపుకునే రోజు భక్తులంతా..నియమ నిష్టలతో తయారు చేసిన నైవేద్యాలను తీసుకొచ్చి బండ్లలో పెట్టిన తర్వాత ఆ బండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. దీనినే ఫలహారబండి ఉత్సవం అంటారు.
పోతురాజు వీరంగం: అమ్మవారి ప్రసాదాల బండికి రక్షణగా ఉంటాడు. పోతురాజు అంటే ఏడుగురి అమ్మవార్లకు సోదరుడు. బోనాలు పండుగలో పోతురాజలే ప్రత్యేక ఆకర్షణ. ప్రతి బస్తీనుంచి పోతురాజు అమ్మవారి ఆలయం వరకూ విన్యాసాలు చేసుకుంటూ వెళతారు. కాళ్ళకి గజ్జెలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో ముంచిన ఎర్రటి వస్త్రాన్ని ధరించి...కళ్లకు కాటుక, కుంకుమతో పెద్ద బొట్టు, నడుముకు వేపాకు చుట్టి..పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యం చేస్తూ ఫలహారం బండి ముందు నడుస్తాడు.
రంగం: బోనాలలో చివరి రోజు జరిగే ముఖ్యమైన ఘట్టం రంగం. అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఓ స్త్రీ మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల గురించి అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది.
బలి: రంగం ముగిసిన మర్నాడు పోతురాజులు అమ్మవారి సన్నిధిలో భక్తితో తాండవం చేస్తారు. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. కాని ఇప్పుడు సంప్రదాయానికి విరుద్దంగా జంతువులను బలి ఇస్తున్నారు.
సాగనంపుట: బలి కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి కలశాలతో పాటూ ఏనుగుపై ఎక్కించి మంగళవాయిద్యాల మధ్య ఊరేగించి నిమజ్జనం చేస్తారు..