బ్రిటన్​ పీఎంగా ఇండియా అల్లుడు బోరిస్ జాన్సన్

బ్రిటన్​ పీఎంగా ఇండియా అల్లుడు బోరిస్ జాన్సన్

 

  •  నేడు బాధ్యతల నుంచి తప్పుకోనున్న థెరెసా మే

లండన్: బ్రిటన్​కొత్త ప్రధాన మంత్రిగా లండన్​మాజీ మేయర్, బ్రెగ్జిట్​కు హార్డ్​కోర్​ సపోర్టర్​ అయిన బోరిస్​జాన్సన్​బుధవారం అధికార పగ్గాలు చేపట్టనున్నారు. మంగళవారం రూలింగ్ కన్సర్వేటివ్​పార్టీ లీడర్షిప్​కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్ ఘన విజయం సాధించారు.​  ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ కు 46,656 ఓట్లు రాగా, జాన్సన్​కు 92,153 ఓట్లు పడ్డాయి. దీంతో బ్రిటన్​కన్సర్వేటివ్​ పార్టీ లీడర్​గా, తద్వారా  ప్రధానిగా జాన్సన్​నియామకం ఖరారు అయింది. బ్రెగ్జిట్​(యూరోపియన్​యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లేందుకు)కు జాన్సన్​ మొదటి నుంచీ గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. తనను ప్రధానిని చేస్తే.. వేర్పాటు ఒప్పందం లేకుండా లేదంటే ఏదో ఒక డీల్ తో అయినా.. బ్రెగ్జిట్​సాధిస్తానని, అక్టోబరు 31 డెడ్​లైన్​నాటికి బ్రిటన్​ను తప్పకుండా యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు తీసుకొస్తానని జాన్సన్ హామీ ఇచ్చారు. బ్రెగ్జిట్​పై 2016లో రెఫరెండం నిర్వహించగా, ఎక్కువమంది ప్రజలు యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు రావాలనే కోరుకున్నారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో  బ్రెగ్జిట్ పై ఎటూ తేల్చుకోలేని విధంగా​సంక్షోభం ఏర్పడటంతో ప్రస్తుత ప్రధాని థెరెసా మే జూన్​ 7న రాజీనామా చేశారు. కొత్త ప్రైమ్​ మినిస్టర్​నియామకం వరకూ ఆమె టెంపరరీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జాన్సన్ రూలింగ్​ పార్టీ లీడర్ గా ఎన్నికైనందున, బుధవారం ఆమె బకింగ్ హాం ప్యాలెస్​లో క్వీన్​ఎలిజబెత్​–2ను కలిసి  బాధ్యతల నుంచి తప్పుకొంటారు. ఆ వెంటనే కొత్త ప్రధానిగా జాన్సన్​ను బ్రిటన్​ రాణి అధికారికంగా నియమిస్తారు. అయితే, కన్సర్వేటివ్​ పార్టీకి బ్రిటన్ పార్లమెంటులో మెజారిటీ లేదు. అందువల్ల నార్తర్న్​ ఐర్లాండ్​కు చెందిన బ్రెగ్జిట్ కు మద్దతు తెలిపే డెమొక్రటిక్ యూనియనిస్ట్​పార్టీ నుంచి 10 మంది ఎంపీల మద్దతు ఉంటేనే ప్రభుత్వం కొనసాగుతుంది. మరోవైపు  డీల్​లేకుండా బ్రెగ్జిట్ కు తాము అంగీకరించబోమని, అలా జరిగితే రాజీనామా చేస్తామంటూ పలువురు మంత్రులు హెచ్చరిస్తున్నారు.

ఇండియాకు అల్లుడు!

బోరిస్​జాన్సన్ భార్య మెరీనా వీలర్ తల్లి దీప్​కౌర్ భారతీయురాలు. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి బాగా పరిచయస్తురాలు కూడా. అందుకే తాను ఇండియాకు అల్లుడినని 55 ఏళ్ల జాన్సన్ తరచూ చెప్పుకొంటారు.ప్రధాని మోడీతో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. అందుకే, పార్టీ లీడర్షిప్ ​కోసం జరిగిన నెలరోజుల ప్రచారంలోఆయన భారత సంతతి నాయకులు, ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇండియా, యూకే రెండు ఆధునిక ప్రజాస్వామ్య దేశాలని, రెండు దేశాలూ ఒకరి కొకరు సహకరించుకుని సవాళ్లను అధిగమించాలని తాను ప్రధాని మోడీతో భేటీలోచెప్పానన్నారు. ఇంతకుముందు మన దేశంపై బ్రిటన్ స్కాచ్ విస్కీ దిగుమతుల సుంకంపెంచడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. జాన్సన్ 1964లో న్యూయార్క్​లో బ్రిటన్ దంపతులకు జన్మించారు. ఆయన1986లో ఆక్స్ ఫర్డ్ లో చదువుతుండగా,ఆ వర్సి టీ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ద టైమ్స్ పత్రికలో జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి, మరికొన్ని ప్రముఖ పత్రికల్లో పనిచేశారు.