
అత్యంత ఖరీదైన ఇండియన్ విస్కీగా రాంపూర్ సిగ్నేచర్ రిజర్వ్ సింగిల్ మాల్ట్ నిలిచింది. ఒక్కో బాటిల్ ధర రూ.5 లక్షలు పలుకుతోంది. రాడికో ఖైతాన్ 2018 లో కేవలం 400 బాటిల్స్ను మాత్రమే విడుదల చేసింది. వీటిలో రెండు మాత్రమే ఇంకా అమ్ముడు కాలేదు. డిమాండ్కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో వీటి ధర చుక్కలనంటుతోంది.