
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఘటన తర్వాత బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్టులను కూడా ఏర్పాటు చేశారు. అయినా బంకు యాజమాన్యాలు బాటిళ్లలో పెట్రోల్ నింపుతున్నారు. దిశ సంఘనతో మరోసారి బాటిల్ పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వాహనదారులకు కొంత వెసులు బాటు కల్పించింది. పెట్రోల్ కోసం బాటిల్తో వచ్చినవారి వారి పేరు, ఫోన్ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలతో పాటు ఆయా వ్యక్తుల ఫొటో కూడా స్మార్ట్ ఫోన్లో తీసుకుని పెట్రోల్ ఇవ్వొచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.