మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం.. బావిలో పడ్డ 25మంది భక్తులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం.. బావిలో పడ్డ 25మంది భక్తులు

శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 కు పైగా మంది మెట్ల బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికులు సైతం బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తు్న్నారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. 

https://twitter.com/ANI_MP_CG_RJ/status/1641346265886646272