కారులో ఊపిరాడక…ఇద్దరు చిన్నారులు మృతి

కారులో ఊపిరాడక…ఇద్దరు చిన్నారులు మృతి

నిజామాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది.. కారులో ఊపిరాడక…ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన రియాజ్, బధ్రుద్దీన్ నిన్న మధ్యాహ్నం ఆడుకుంటామని బయటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో… తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అర్ధరాత్రి వెతకగా… ఓ కారులో పిల్లలు చనిపోయి కనిపించారు. పిల్లలు ఊపిరాడక చనిపోయి ఉంటారని భావిస్తుండా….కుటుంభ సభ్యులు మాత్రం మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.