‘పద్మశ్రీ’ అందుకున్న బ్రిటిష్​ ఎంపీ గార్డినర్

‘పద్మశ్రీ’ అందుకున్న బ్రిటిష్​ ఎంపీ గార్డినర్

లండన్: బ్రిటిష్ పార్లమెంట్​ సభ్యుడు బారీ గార్డినర్​, దివంగత బ్రిటిష్​ థియేటర్​ డైరెక్టర్​ పీటర్​ బ్రూక్ కుమారుడు సైమన్​బ్రూక్​ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నా రు. లండన్​లోని ఇండియా హౌస్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వీరికి పురస్కారాలను అందజేశారు. కాగా, గార్డినర్​ బ్రిటిష్​ పార్లమెంట్​లో ప్రతిపక్ష లేబర్​ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 2020లో పద్మశ్రీని  ప్రకటించారు.

అయితే లాక్​డౌన్​ కారణంగా ఆయన పద్మశ్రీని అందుకోలేకపోయారు. ‘ది మహాభారత’ తో గుర్తింపు పొందిన థియేటర్​ డైరెక్టర్​ పీటర్​ బ్రూక్​ కళారంగానికి చేసిన సేవకు గుర్తింపుగా 2021లో పద్మశ్రీ ప్రకటించా రు. బ్రూక్​ గతేడాది చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు సైమన్​ బ్రూక్​కు పద్మశ్రీని అందజేశారు.