లండన్: బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బారీ గార్డినర్, దివంగత బ్రిటిష్ థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్ కుమారుడు సైమన్బ్రూక్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నా రు. లండన్లోని ఇండియా హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వీరికి పురస్కారాలను అందజేశారు. కాగా, గార్డినర్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 2020లో పద్మశ్రీని ప్రకటించారు.
అయితే లాక్డౌన్ కారణంగా ఆయన పద్మశ్రీని అందుకోలేకపోయారు. ‘ది మహాభారత’ తో గుర్తింపు పొందిన థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్ కళారంగానికి చేసిన సేవకు గుర్తింపుగా 2021లో పద్మశ్రీ ప్రకటించా రు. బ్రూక్ గతేడాది చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు సైమన్ బ్రూక్కు పద్మశ్రీని అందజేశారు.