
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఐపీఓకు వచ్చేందుకు రెడీ అయ్యింది. సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్స్ ఫైల్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.ఆరు వేల నుంచి రూ.8,500 కోట్లు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ఐపీఓలో ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రెండూ ఉన్నాయి.
కంపెనీ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లతో ప్రీ-ఫైల్డ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ఫైల్ చేసిందని బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పేర్కొంది. పీక్ ఎక్స్వీ, టైగర్ క్యాపిటల్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి ప్రముఖ ఇన్వెస్టర్లు గ్రోలో ఇన్వెస్ట్ చేశారు. ఐపీఓ ద్వారా సేకరించిన డబ్బును టెక్నాలజీ డెవలప్మెంట్కు, బిజినెస్ను విస్తరించడానికి వాడతారు.
ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం వాల్యుయేషన్ సుమారు 7 బిలియన్ డాలర్లు (రూ.58,000 కోట్లు) ఉండొచ్చని అంచనా. ఐపీఓ పనులు చూసుకోవడానికి జేపీ మోర్గాన్ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ను కంపెనీ నియమించింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్రోకింగ్ సెగ్మెంట్లో గ్రోకు 26.26 శాతం మార్కెట్ వాటా ఉంది. 2024–25 లో ఈ ప్లాట్ఫాం 34 లక్షల కొత్త అకౌంట్స్ యాడ్ చేసింది. యాక్టివ్ క్లయింట్ బేస్ మార్చి 2025 నాటికి 1.29 కోట్లు.