ఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం : ముఠా గోపాల్

ఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం : ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు : ఐదేళ్ల కాలంలో ముషీరాబాద్ సెగ్మెంట్​కు ఇచ్చిన హామీలను నెరవేర్చానని.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కోరారు. శనివారం హెరిటేజ్ ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహించిన పవర్ ఆఫ్ యూత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పఠాన్ బస్తీలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ..  అత్యధిక నిధులు ఖర్చు చేసి సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ముషీరాబాద్​ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ సర్కారే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇన్ చార్జి సాయికిరణ్​యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు ముఠా జైసింహ,  ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.