
హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్రపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నాందేడ్లో బహిరంగ సభ నిర్వహించి ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి రీజినల్ కో ఆర్డినేటర్లను నియమించారు. ఈ నెల 26న కాందార్లోహలో మరో భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిశారు. వారంతా ఎన్సీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరబోతున్నారు.
కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, ఎన్సీపీ యూత్ వింగ్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, నాయకులు శివదాస్ ధర్మపురికర్, మనోహర్ పాటిల్ భోసికర్, డాక్టర్ సునీల్ పాటిల్ఉన్నారు. సుభాశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.