మహారాష్ట్రలోని బారామతివిమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తోపాటు మరో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది, ఒకరు అజిత్ పవార్ వ్యక్తిగత సహాయకురాలు కాగా.. మరో వ్యక్తి ఆయన బాడీగార్డ్విదిప్ దిలీప్ జాదవ్ ఉన్నారు. జాదవ్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. జాదవ్ మరణంతో ఆయన స్వస్థలం థానేలోనికల్వాలలోని విటావాలో విషాద ఛాయలు అలముకొన్నాయి. జాదవ్ చనిపోయాడన్న విషయాన్ని ఆ ప్రాంతంలోని ప్రజలు జీర్ణించుకోలేపోయారు.
విమాన ప్రమాదం దురదృష్టకరం.. అనుకోని ప్రమాదం జాదవ్ కుటుంబాన్ని వీధిన పడేసింది.. జాదవ్ కు చిన్న చిన్న పిల్లలున్నారు.. వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది..ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్తితి రాకూడదని అతని ఇంటి పక్కన ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారు విచారం వ్యక్తం చేశారు. జాదవ్ అజిత్ పవార్ బాడీగార్డుగా పనిచేస్తున్నప్పటికీ అతని ఉద్యోగం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా పబ్లిసిటీ కోరుకోలేదనిస్థానికులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో అత్యంత సీనియర్ రాజకీయ నేతలలో ఒకరి భద్రతను చూస్తున్నప్పటికీ జాదవ్ అందరితో వినయంగా, మృదువుగా మాట్లాడే వాడని, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని గుర్తు స్థానికులు చేసుకున్నారు. జాదవ్ మరణం వార్త మొదట అతని భార్య పిల్లలు తెలియలేదు. విషాద ఘటనలో జాదవ్ మృతిచెందాడని తెలియగానే అతని భార్య పిల్లలు దుఖసాగరంలో మునిగిపోయారు.
FPJ spoke to the neighbours of Vidip Dilip Jadhav, a resident of Kalwa’s Vitawa area in Thane, who lost his life in a tragic plane crash while travelling with DCM Ajit Pawar.#AjitPawar | #PlaneCrash | #DeputyCM pic.twitter.com/kN5leioDUd
— Free Press Journal (@fpjindia) January 28, 2026
