
-
నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు
-
కాళేశ్వరంపై సమగ్ర విచారణకు కట్టుబడి ఉన్నాం
ఆదిలాబాద్: బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ను తిరస్కరించేలా చేశాయి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ప్రభుత్వం సమగ్ర విచారణ చేయిస్తోందని అన్నారు.
కమిషన్కు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించబోతున్నామని జూపల్లి చెప్పారు. బీఆర్ఎస్ పాలన ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానకరమని ధ్వజమెత్తారు. రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
ఎలాంటి ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే నమ్మకం ఉందని వివరించారు. పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందరం కలిసి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు.