ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడుతుంది. పార్టీల లీడర్లు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. ఆదివారం(నవంబర్ 26) అర్ధరాత్రి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 13లో ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. సునీల్ అనే వ్యక్తి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని నారాయణగూడ పోలీసులకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాచారం ఇచ్చారు.
పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడి ఆదేశాల మేరకే డబ్బులు పంచుతున్నట్లు సునీల్ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు.