ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : గడ్డం వంశీ కృష్ణ

ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. బీఆర్ఎస్ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణగా మారిందని చెప్పారు. చదువుకున్న యువత ఉపాధి హామీ కూలీ పనులు వెళ్తున్నారని తెలిపారు. ధర్మపురి లో పక్కనే గోదావరి ఉన్నా త్రాగు నీరు లేని పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ పాలనలోనే అని విమర్శించారు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గడ్డం వంశీ మాట్లాడుతూ  బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా,భూ కబ్జాలు,ఉద్యోగాలు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రభుత్వ సంస్థలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. 

తెలంగాణ వచ్చిన తర్వాతనే కనుమూస్తానని కాకా వెంకటస్వామి చెప్పారని వంశీ కృష్ణ అన్నారు.  కాక స్ఫూర్తి తో రాజకీయాల్లోకి సేవ చేయడానికి వస్తున్న నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని తెలిపారు గడ్డం వంశీ కృష్ణ.