తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 6, ఎంఐఎం4, బీజేపీ 3 ,కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం 4వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్.. 710 ఓట్ల ఆధిక్యం.. నాలుగో రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వెనుకంజలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.
ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్,కంటోన్మెంట్, అంబర్ పేట, ముషీరాబాద్ లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. గోషామహల్ ,కార్వాన్, యాకుత్ పురాలో బీజేపీ లీడ్ లో ఉంది. చార్మినార్, బహదూర్ పురా,చంద్రాయణగుట్ట, మలక్ పేటలో ఎంఐఎం లీడ్ లో ఉంది.
సనత్ నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందంజలో ఉన్నారు.గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ లో తలసాని కీలకంగా వ్యవహరించారు.