ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి :  పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్​జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే, రైతు బంధు చైర్మన్ తాటికొండ రాజయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జనగామలో సీఎం సభ జరిగినా ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు శనివారం మరోసారి సీఎం కేసీఆర్ చేర్యాల పట్టణానికి వస్తున్నారన్నారు.

సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయమై జనగామ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని మరోసారి సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. గతంలో ఎమ్మెల్యే గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రెండు సార్లు ఎలా ఆదరించారో అలాగే తనను కూడా ఆదరించాలని కోరారు.