బీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేదు..వివేక్ వెంకటస్వామితో బాధలు చెప్పుకున్న గులాబీ కార్యకర్తలు

బీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేదు..వివేక్ వెంకటస్వామితో బాధలు చెప్పుకున్న గులాబీ కార్యకర్తలు

బీఆర్ఎస్ పార్టీ కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.కేసీఆర్ కుటుంబం తెలంగాణను గుప్పిట్లో పెట్టుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పైసలను ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చుపెడ్తున్నారని మండిపడ్డారు. 

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బోనగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. బీఆర్ఎస్ లో  తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదని బాధలు చెప్పుకున్నారు. వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో బీజేపీలో చేరడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే కటికెనపల్లి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి బీజేపీలో  చేరుతామన్నారు బీఆర్ఎస్ నాయకులు.