
మెదక్, వెలుగు: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత మీటింగ్ కు బీఆర్ఎస్ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదివరకు కవిత మెదక్ వచ్చినపుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇప్పుడు మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కవిత పాల్గొన్న మీటింగ్ జరిగే హాల్ వైపు రాకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కవిత పాల్గొనే మీటింగ్ కు వెళ్లొద్దని ఆ పార్టీ ముఖ్య నేతలు హెచ్చరించినట్టు తెలిసింది.