
చందనాగర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని.. మరోసారి తనను ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. శనివారం చందానగర్ డివిజన్ లోని శివాజీనగర్, వీకర్ సెక్షన్, సిటిజన్ కాలనీ, రాజీవ్ నగర్, వెంకటాద్రినగర్, ఇందిరానగర్, హుడా ఫేజ్–2 కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని జనాలకు వివరించారు.
శేరిలింగంపల్లి సెగ్మెంట్ ను ఎంతో డెవలప్ చేశానని.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గాంధీ కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.