
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ( ఆగస్టు 31) కొనసాగుతున్నాయి. ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఆయన బీసీ మంత్రిగా పనిచేసినప్పటికి .. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా చట్టసభలో మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకే.. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోగా ఎన్నికల నిర్వహించేందుకు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందేకు బీసీ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. సభావేదికగా తప్పుడు సమాచారం ఇవ్వవద్దన్నారు. ఆరు నూరైనా ఇచ్చిన మాటను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చట్టసభలో స్పష్టం చేశారు.