హైదరాబాద్, వెలుగు: క్వశ్చన్అవర్లో సుదీర్ఘ ప్రసంగం చేయడం అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్వశ్చన్అవర్లో సీఎం రేవంత్ గంటన్నరపాటు మాట్లాడటం అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
ఈ మేరకు శనివారం ఆయన మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే.. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని హరీశ్ రావు అడిగారని, దీనిపై సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం, ఉద్యమ సమయంలోనూ ఎన్నడూ ఇంతటి అవమానాలు ఎదుర్కోలేదని గంగుల కమలాకర్ అన్నారు.
