సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని, అందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తీర్మానించారు. ఆదివారం బోయిన్పల్లిలోని మాజీ మంత్రి, మేడ్చల్ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయి చర్చించారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని మొదట మల్లారెడ్డి కుమారుడు కొడుకు భద్రారెడ్డికి బీఆర్ఎస్అధినేత సూచించారు.
తన కొడుకు పోటీ చేయడంలేదని మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. మరో బీఆర్ఎస్ నేత శంభీపూర్రాజును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించగా ఆయన కూడా పోటీకి విముఖత చూపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్నుంచి ఉప్పల్నుంచి టికెట్ కు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్సీనియర్నేత రాగిడి లక్ష్మారెడ్డి అనంతరం బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేశారు. దీంతో అధిష్టానం లక్ష్మారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్నేతలను కలుస్తూ తన గెలుపుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్నేతలతో మల్లారెడ్డి ఇంట్లో కలిశారు. గెలుపుపై వ్యూహరచన చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు దయానంద్, నవీన్ రావు , మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
