
- ఎన్నికలకు ముందు పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం
- ఫండ్స్, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతులు
- సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ను కలిసేందుకు బీఆర్ఎస్ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అసెంబ్లీలోని ఆయన చాంబర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని తమ పనులు చక్కబెట్టాలని కోరారు. గురువారం అసెంబ్లీ ప్రారంభమవడానికి ముందు, వాయిదా పడిన తర్వాత కేటీఆర్ను ఎమ్మెల్యేలు కలిశారు. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు ఇతర పనులకు ఫండ్స్, ప్రయారిటీ పనులకు అనుమతులు, ఇతర వ్యవహారాలను కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.
సభ ప్రారంభమవడానికి గంట ముందే కేటీఆర్అసెంబ్లీలోని తన చాంబర్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెయిట్చేస్తూ కనిపించారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లి తమ విజ్ఞప్తులు చెప్పుకున్నారు. ఆయా పనులపై సీఎం కేసీఆర్తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేటీఆర్హామీ ఇచ్చారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చేనేత, జౌళి శాఖపై మంత్రి కేటీఆర్ఉన్నతాధికారులతో రివ్యూ చేయగా.. రివ్యూ ముగిసే వరకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడే వెయిట్చేశారు. కేటీఆర్అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఎమ్మెల్యేలు అక్కడి నుంచి బయటకు కదిలారు.
కేటీఆర్తో జగ్గారెడ్డి భేటీ
కేటీఆర్తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఆయన చాంబర్లో కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం కేటీఆర్తో సమావేశంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో పనిచేసే ఎనిమిది మంది కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, అలాంటి వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అదే విషయం కేటీఆర్కు చెప్పి వారిని తిరిగి సంగారెడ్డికి రప్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చానన్నారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.