కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ నడస్తుండు : కవిత

కేసీఆర్ బాటలోనే  సీఎం  రేవంత్ నడస్తుండు : కవిత

ప్రజా దర్బార్ ఒక్క రోజు మురిపమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 60 రోజుల్లో ఒక్క రోజే సీఎం ప్రజలను కలిశారని చెప్పారు. కేసీఆర్ చూపిన దారే కరెక్ట్ అని జనం భావిస్తున్నారని.. సీఎం రేవంత్ కూడా దానినే ఫాలో అవుతుండటం సంతోషమని తెలిపారు. 2024  ఫిబ్రవరి 3వ తేదీన మీడియాతో మాట్లాడారు కవిత..  ఇంద్రవెల్లి సభ కోసం ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగించారని కవిత  ప్రశ్నించారు.  ఆ సభ కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వందరోజల వరకు ఓపిక పడుతామన్నారు కవిత. వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమని.. కచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.  కాంగ్రెస్ పార్టీలో 22కుటుంబాలకు టికెట్లు ఇచ్చారని..  మరి కాంగ్రెస్ ది కుటుంబ పాలన కాదా అని కవిత నిలదీశారు.  హామీల అమలుకు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కవిత.   ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ పదవి లేని ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారని..    ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిస్తే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.