- ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు
సిటీ నెట్వర్క్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఆందోళన చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్వీ లీడర్గెల్లు శ్రీనివాస్, కార్యకర్తలతో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లిలో నల్ల కండువాలతో వరంగల్హైవేపై రాస్తారోకో చేశారు. ఐఎస్సదన్చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ స్వప్న, సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జల్పల్లిలో మాజీ కార్పొరేటర్ సుక్క శివకుమార్, చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్లీడర్ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
దోమలగూడ బండ మైసమ్మ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ లీడర్ఎమ్మెన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని నేషనల్హైవేపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా చెప్పినా వినకపోవడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్చేసి పీఎస్కు తరలించారు. బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీజేఆర్ చౌరస్తా వద్ద బైఠాయించారు. బీసీ కమీషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.
