పంచాయతీ కార్యదర్శిపై బీఆర్​ఎస్​ సర్పంచ్​ భర్త దాడి

పంచాయతీ కార్యదర్శిపై బీఆర్​ఎస్​ సర్పంచ్​ భర్త దాడి

పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్​ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయతీ కార్యదర్శి దర్గయ్యపై  జూన్​ 22న బీఆర్​ఎస్ సర్పంచ్​ చిర్ర లక్ష్మీ భర్త చిర్ర జనార్దన్​రెడ్డి దాడికి దిగాడు. ఈ దాడిలో దర్గయ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు పోలీస్​స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

సర్పంచ్​ భర్త పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశాడు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది పంచాయతీ కార్యదర్శులకు రక్షణ కల్పించాలంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. కాగా జిల్లాల్లో బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. పలు చోట్ల పోలీస్​ సిబ్బంది వీటిని చూసి చూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.