హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా జరగడం తో బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలకు తెర లేపింది. సూర్యాపేట మున్సిపా లిటీలో 48 వార్డులు ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ నెలకొంది.
ఈ క్రమంలో బీఆర్ ఎస్ పార్టీకి చెందిన 45మంది కౌన్సిలర్ అభ్యర్థులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ కు తరలించారు.. తిరిగి కౌంటింగ్ రోజున ఉదయం వారిని తీసుకొచ్చేలా ప్లానింగ్ చేసినట్లు సమాచారం.
