
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తనపై ఏమైనా కేసు నమోదు అయిందా? కనీసం అణువంత రుజువైనా ఉన్నదా? అని గురువారం ఓ ప్రకటనలో కేటీఆర్ ప్రశ్నించారు. చిట్చాట్ పేరిట తనతో పాటు ఇతరులపైనా సీఎం రేవంత్ విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదని, సీఎం ఆఫీసుకు గౌరవమిచ్చి ఇప్పటిదాకా సంయమనం పాటించానన్నారు.
సీఎం రేవంత్కు దమ్ముంటే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరి రేవంత్ రెడ్డి తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు.