- కేసీఆర్కే కేటీఆర్ వారసుడు.. బీఆర్ఎస్కు కాదు : ఎమ్మెల్యే మందుల సామేల్
యాదాద్రి, వెలుగు : 'బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామంలో అందరూ పెయిడ్వర్కర్లే పాల్గొన్నారు, అసలైన వాళ్లెవరూ రాలేదు' అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు వారసుడు కేటీఆరే.. కానీ బీఆర్ఎస్కు మాత్రం కాదన్నారు. అందుకే పెద్ద లీడర్లెక్క యువ సంగ్రామం నిర్వహించినా.. హరీశ్, పద్మారావు, జగదీశ్రెడ్డి వంటి వాళ్లెవరూ రాలేదన్నారు.
కేటీఆర్ఇంకా చిన్న పిల్లాడి మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ ఉండదని, కేటీఆర్మళ్లీ అమెరికాకు వెళ్లాల్సిందేనన్నారు. కేటీఆర్మంత్రి పదవితో ఎంజాయ్చేశారే తప్ప.. మున్సిపల్ కార్మికులకు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ను అసెంబ్లీకి ఎందుకు రానిస్తలేరని, ఆయన అసెంబ్లీకి వస్తేనే గౌరవం ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేయించారని, నేరెళ్ల బాధితులు ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్పై అవాకులు చవాకులు పేలవద్దన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పార్టీలో నెలకొన్న విబేధాలు సమసిపోయాయని చెప్పారు. జగ్గారెడ్డి చెప్పినట్టుగా తరచుగా గొడవ పడలేమన్నారు. ఉపాధి కోసం ముంబై, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు. ఎల్నినో కారణంగా వానలు కురుస్తలేవని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.
