
- అంబేద్కర్ పేరుతో కేసీఆర్ నాటకాలు
- ఈ సర్కార్ను గద్దె దించుదాం.. బడుగు బలహీనవర్గాలను అధికారంలోకి తెద్దాం
- ‘తెలంగాణ భరోసా’ సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి
- రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ను ఎవరూ నమ్మరు
- ఓట్ల కోసం అంబేద్కర్ పేరు మీద రాజకీయాలు చేస్తున్నడు
- మేం యూపీలో దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినం
- మా స్కీమ్ను కేసీఆర్ కాపీ కొట్టి..
- దాన్ని కాగితాలకే పరిమితం చేశారని ఫైర్
- అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సీఎం అని ప్రకటన
- బీఎస్పీ దెబ్బకు కేసీఆర్ బేహోష్ అయిండు..
- అందుకే అంబేద్కర్ విగ్రహం పెట్టిండు: ప్రవీణ్కుమార్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ‘‘అంబేద్కర్ పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నడు. యూపీలో దళితులకు మూడెకరాల భూమి ఇచ్చింది మా ప్రభుత్వం. ఆ పథకాన్నే కేసీఆర్ కాపీ కొట్టిండు.. కానీ, దాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేసిండు. ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదు” అని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ను గద్దె దించాల్సిందేనని, బడుగు బలహీనవర్గాలు అధికారంలోకి రావాలని అన్నారు.
ఆదివారం హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ భరోసా’ సభలో మాయావతి మాట్లాడారు. రాష్ట్రంలో బీఎస్పీ బలపడుతుండడంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్ల కోసం అంబేద్కర్ పేరుతో కేసీఆర్ రాజకీయాలు మొద లుపెట్టారని అన్నారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగా న్ని మారుస్తానని ఒకటికి రెండుసార్లు చెప్పిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓట్ల కోసమే అంబేద్కర్ పేరిట నాటకాలు ఆడుతున్నడు. కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదు’’ అని ఆమె తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిని చంపిన వ్యక్తిని.. బీహార్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసినా కేసీఆర్ స్పందించకుండా సైలెంట్ అయ్యార న్నారు. తెలంగాణ ఏర్పాటుకు మొదట మద్దతి చ్చింది బీఎస్పీయేనని పేర్కొన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమారే సీఎం అవుతారని వెల్లడించారు. ముందే చెప్తున్నా అంటూ కార్యకర్తల సమక్షంలో ఆయన పేరును మాయావతి ప్రకటించారు. తెలంగాణలోనూ యూపీ తరహాలో బడుగుబలహీన వర్గాల వారిని కలుపుకొనిపోతామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
అంబేద్కర్ లక్ష్యాలు నెరవేరలే
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం రాజ్యాంగంలో బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని మాయావతి అన్నారు. అయినా కూడా నేటికీ ఆయా వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తే ఆర్థికంగా మెరుగవుతారని నాడు నెహ్రూ ప్రభుత్వానికి అంబేద్కర్ సూచించారని, వారిలాగానే ఇతర వెను కబడిన వర్గాలకూ రిజర్వేషన్లు కల్పించేలా కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ 340 ఆర్టికల్ను పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ, అంబేద్కర్ మాటలను నెహ్రూ పట్టించుకోలేదన్నారు. అంబేద్కర్ లక్ష్యాలను కాన్షీరాం అమలు చేశారని, ఆయన బాటలో నడిచా రని చెప్పారు. అందులో భాగంగానే బీఎస్పీని ఏర్పా టు చేశారని, ఆయన మరణానంతరం తాను పార్టీని ముందుకు తీసుకెళ్తున్నానని మాయావతి తెలిపారు.
నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తున్నది
ఎన్నికల టైమ్లో నిరుద్యోగులను మోసం చేయడం కామన్ అయిందని, ఎన్నికలొచ్చినప్పుడల్లా కాం గ్రెస్ పార్టీ నిరుద్యోగం మాటెత్తుకుంటున్నదని మా యావతి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఆ పార్టీ ఎన్నో చెప్పిందని, అది కరెక్ట్ కాదని అన్నారు. కేవలం నాలుగైదు వేలతోనే కుటుంబం నడుస్తదా? అని ప్రశ్నించారు. కానీ, తాను అధికారంలో ఉన్నప్పుడు యూపీలో భృతికాదు.. ఉద్యోగాల కల్పననే చేశానని మాయావతి చెప్పారు. తాము కార్యకర్తల అండతోనే, వారిచ్చే విరాళాలతోనే రాజకీయం చేస్తున్నామని తెలిపారు.