- సబ్ కలెక్టర్ వికాస్ మహతో
బోధన్, వెలుగు : బోధన్ పట్ణణంలోని మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులకు సూచించారు. బుధవారం బోధన్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల సంబంధిత పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు.
వార్డులు, పోలింగ్ కేంద్రాలు, ఇంటినంబర్ల వారీగా జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు ఉంటే సంబంధిత వార్డు ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
