సెప్టెంబర్ మూడో వారంలోగా బీఎస్పీ లిస్ట్​ : ఆర్ఎస్. ప్రవీణ్​కుమార్

సెప్టెంబర్ మూడో వారంలోగా  బీఎస్పీ లిస్ట్​ :  ఆర్ఎస్. ప్రవీణ్​కుమార్

హైదరాబాద్, వెలుగు: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ మూడో వారంలోగా ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్​ ప్రవీణ్​కుమార్ అన్నారు.​అమెరికా పర్యటన ముగించుకొని శనివారం ఇండియాకు చేరుకున్న సందర్భంగా  శంషాబాద్​ ఎయిర్ పోర్టులో ఆయనకు బీఎస్పీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్ఎస్. ప్రవీణ్​కుమార్​మాట్లాడుతూ.. విదేశాల్లోని మన రాష్ట్ర బహుజనులు తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. 

రాష్ట్రంలో బహుజన వర్గాలపై అణచివేత తీవ్రంగా ఉందన్నారు.  సుమారు 600 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతూ.. అంబేద్కర్ ఓవర్ సీస్ నిధులు అందక ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. వట్టే జానయ్య యాదవ్ వంటి బహుజనులపై దాడులు అత్యంత బాధాకరమని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అణచివేత ఆగాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. మాయవతిని ప్రధాని చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.