
పద్మారావునగర్, వెలుగు: బౌద్ధనగర్ డివిజన్అంబర్నగర్నాలాలో గురువారం రాత్రి కొట్టుకువచ్చిన మహిళ డెడ్బాడిని సీతాఫల్ మండి మేడిబావికి చెందిన వెంకటమ్మ (50) గా పోలీసులు గుర్తిం చారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ ఏరియాలో భారీ వాన కురవగా నాలాలు పొంగిపొర్లాయి. ఆ సమయంలో దూద్బావి నాలా పక్కనుంచి నడుస్తూ వెళ్తున్న వెంకటమ్మ ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయింది.
డెడ్ బాడీని అంబర్ నగర్వద్ద నాలాలో స్థానికులు గుర్తించి, బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అద్దె ఇంటిలో ఉంటూ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే వెంకటమ్మకు ముగ్గురు కూతుళ్లలో ఇద్దరికి వివాహమైంది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు. వరుసగా వర్షాలు కురుస్తున్నందున సిటీలోని నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.