ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి వద్ద తూటా ....స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు

ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి వద్ద తూటా ....స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద పోలీసులు తూటా గుర్తించారు. విశాల్ అనే ప్రయాణికుడు బుధవారం ఇండిగో(6ఈ-6709) ఫ్లైట్​లో కలకత్తా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌కు వచ్చాడు. తిరిగి బెంగుళూరు వెళ్లేందుకు మరో ఇండిగో(6ఈ-887) ఫ్లైట్​కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టికెట్ బుక్​ చేసుకుని బోర్డింగ్ వద్దకు వెళ్లాడు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు విశాల్ లగేజీ బ్యాగ్ ను తనిఖీ చేయగా 0.38 లైవ్ బుల్లెట్ దొరికింది. దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని తూటాను స్వాధీనం చేసుకున్నారు. విశాల్​ను ఎయిర్​పోర్టు పోలీసులు విచారిస్తున్నారు.