గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ
  •      తమిళిసైని కలిసిన వెంకటేశం

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం విద్యా శాఖ, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశంకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఇప్పటి వరకు గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్ర మోహన్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.