స్కూటీని గుద్దిన ఆర్టీసీ బస్సు : మహిళ మృతి

స్కూటీని గుద్దిన ఆర్టీసీ బస్సు : మహిళ మృతి

స్కూటీ (హోండా యాక్టివా) పై వెళ్తున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో జరిగింది. ఈ ప్రమాదంలో సోహిణీ సక్సేనా అనే మహిళ తలపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. మహిళ పరిస్థితిని చూసిన స్థానికులు బస్సు అద్ధాలను ద్వంసం చేశారు. సోహిణీ టాటా కన్సల్ టెంట్ లో పని చేస్తుంది. ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక సిబ్బంది బస్సులను నడపడంతో పలు చోట్ల ఇప్పటికే ప్రమాదాలు జరిగాయి. అయితే బంజారాహిల్స్ లో జరిగిన ఈ ప్రమాదం మాత్రం స్థానికులను కలిచివేసింది.