జైపూర్: రాజస్థాన్ లో వ్యాన్, బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్లో కొత్తగా ఏర్పడిన డీడ్వానా కుచమన్జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
డీఎస్సీ ధరమ్చంద్ బిష్ణోయ్ఈ సందర్భంగా మాట్లాడుతూ కున్కునా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంతాడి గ్రామం వద్ద యాక్సిడెంట్ జరిగిందని వెల్లడించారు. యాక్సిడెంట్ లో గాయపడిన ఇద్దరిని బంగర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, వారి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడ నుంచి జైపూర్కు తరలించినట్లు డీఎస్పీ బిష్ణోయ్ వివరించారు.