రాజస్థాన్​లో వ్యాన్, బస్సు ఢీ.. ఏడుగురి మృతి

రాజస్థాన్​లో వ్యాన్, బస్సు ఢీ.. ఏడుగురి మృతి

జైపూర్​: రాజస్థాన్ లో వ్యాన్, బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్​లో కొత్తగా ఏర్పడిన డీడ్వానా కుచమన్​జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

డీఎస్సీ ధరమ్​చంద్ బిష్ణోయ్​ఈ సందర్భంగా మాట్లాడుతూ కున్​కునా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బంతాడి గ్రామం వద్ద యాక్సిడెంట్​ జరిగిందని వెల్లడించారు. యాక్సిడెంట్ లో గాయపడిన ఇద్దరిని బంగర్​ ఆసుపత్రిలో అడ్మిట్​ చేశామని, వారి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడ నుంచి జైపూర్​కు తరలించినట్లు డీఎస్పీ బిష్ణోయ్​ వివరించారు.