ఆటో, బుల్లెట్ ఢీకొని ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సమీపంలో ఘటన

ఆటో, బుల్లెట్ ఢీకొని ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సమీపంలో ఘటన

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ పట్టణ శివారులోని అంకాపూర్​ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్​కు చెందిన సాయిప్రసాద్(21) ఆర్మూర్​కు బుల్లెట్​పై వస్తుండగా, ఆర్మూర్  నుంచి నిజామాబాద్  వైపు  ప్రయాణికులతో వెళ్తున్న ఆటో సప్తగిరి ఫంక్షన్​ హాల్​ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో సాయిప్రసాద్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి(35) తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరాటి హారిక కుడికాలు విరగగా, మిగతా నలుగురికి గాయాలయ్యాయి. ఎస్​హెచ్​వో సత్యనారాయణగౌడ్​ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్​కు తరలించారు.