చెరుకు రైతులకు .. మోదీ సర్కార్ గుడ్ న్యూస్

చెరుకు రైతులకు ..  మోదీ సర్కార్ గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  అంతరిక్ష రంగంలో ఎఫ్ డీఐలకు ఆమోదం తెలిపింది.  అంతేకాకుండా  2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్‌లో చెరకు పంట ధరను క్వింటాల్ కు రూ.  315 నుంచి రూ.  340కి పెంచింది.  అంటే  8 శాతం పెంపును  కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 5 కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లాభం చేకూరనుంది.  ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది.