ప్రజాపాలన హామీల అమలుకు కేబినెట్ సబ్కమిటీ

ప్రజాపాలన హామీల అమలుకు కేబినెట్ సబ్కమిటీ

ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా  మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు.  ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు ఐదు గ్యారంటీల కోసం దాదాపు కోటి 25 లక్షలకు పైగా మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను జనవరి 17 వరకు  ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది.