సీఏఎఫ్​ కమాండర్​ను గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

సీఏఎఫ్​ కమాండర్​ను గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

 బీజాపూర్: భద్రతా విధుల్లో ఉన్న చత్తీస్ గఢ్  ఆర్మ్  ఫోర్స్ (సీఏఎఫ్) కమాండర్ ను మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపారు. చత్తీస్ గఢ్ లో బీజాపూర్  జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కుర్తు పోలీస్ స్టేషన్  పరిధిలో ఉన్న ఆ గ్రామంలో భద్రతా విధుల కోసం సీఏఎఫ్​ బృందాన్ని తరలించారు.

బృందానికి నాయకత్వం వహిస్తున్న కమాండర్  తిజావు రామ్  భౌర్య గ్రామంలోని మార్కెట్ లో విధుల్లో ఉండగా కొంతమంది మావోయిస్టులు అకస్మాత్తుగా ఆయనపై గొడ్డలితో దాడిచేసి పారిపోయారు. భౌర్య తీవ్రంగా రక్తమోడుతూ అక్కడికక్కడే చనిపోయారు. సీఏఎఫ్​లోని నాలుగో బెటాలియన్ లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన హత్య గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.