గుంటూరు కారం నుండి పీఎస్ వినోద్ ఔట్?.. అసలేం జరుగుతుంది భయ్యా

గుంటూరు కారం నుండి పీఎస్ వినోద్ ఔట్?.. అసలేం జరుగుతుంది భయ్యా

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా చేస్తున్న గుంటూరు కారం(Gunturu kaaram) సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో తెలియదు కానీ.. ముందు నుండి ఈ సినిమాకు అన్నీ అడ్డంకులే. షూటింగ్ మొదలవడం నుండి.. హీరోయిన్ మార్చే వరకు అన్నీ అడ్డంకులే. ఇక తాజాగా ఈ సినిమా కోసం మరొకరిని మార్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ మహేష్ అభిమానులను కలవరపెడుతోంది. ఇవన్నీ చూస్తున్న ఫ్యాన్స్ అసలు సినిమా  రిలీజ్ అవుతుందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం కెమెరామెన్ గా పీఎస్ వినోద్(PS Vinod)  ను తీసుకున్నారు. త్రివిక్రమ్(Trivikram) చాలా సినిమాలకు ఈయనే కెమెరామెన్ గా వర్క్ చేశారు. అందులో భాగంగానే గుంటూరు కారం కోసం కూడా పీఎస్ వినోద్ ను తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుండి పీఎస్ వినోద్ తప్పుకున్నారట. దానికి కారణం సినిమా షూటింగ్ డిలే అవడమే. ముందుగా ఈ సినిమా కోసం పీఎస్ వినోద్ ఇచ్చిన డేట్స్ నెక్స్ట్ మంత్ తో పూర్తవనుందట. అందుకే ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నారట. ప్రస్తుతం ఆయన ప్లేస్ లో రవి కె చంద్రన్(Ravi K Chandran) ను తీసుకున్నారని సమాచారం. 

ఇక సినిమాకు వస్తున్న వరుస అడ్డంకులతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ లో ఉన్నారు. అనుకున్న సమయానికి సినిమా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గుంటూరు కారం సినిమాలో మెహెష్ కు జోడీగా.. శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Menakshi choudary) నటిస్తుండగా.. తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు.